News March 15, 2025

నీటి కుంటలో పడి ఇద్దరు బాలికల మృతి

image

అనంతపురం జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలో సంచారాలు చేసేవారు నివాసం ఉంటున్నారు. అయితే ఎద్దులు మేపేందుకు ఇద్దరు బాలికలు వెళ్లారు. ఎడ్లు పెన్నా నదిలో దిగి నీరు తాగుతుండగా.. వాటిని బయటకు తోలే ప్రయత్నంలో ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. మృతులు కల్లూరుకి చెందిన లక్ష్మి(10), హరిణి(12)గా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు.

Similar News

News February 9, 2026

పందిళ్లపల్లికి యూరియా రాక.. మూడు జిల్లాలకు కేటాయింపు

image

రైతులకు ఊరటనిస్తూ పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆదివారం యూరియా చేరుకుంది. క్రిబ్కో కంపెనీకి చెందిన 2,646 మెట్రిక్ టన్నుల ఎరువులు రైల్వే వ్యాగన్ల ద్వారా వచ్చినట్లు ఏఓ పవన్‌కుమార్ తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,246 టన్నులు, భద్రాద్రి కొత్తగూడెంకు 500, మహబూబాబాద్‌కు 700 టన్నుల యూరియాను కేటాయించారు. మిగిలిన 200 టన్నులను అత్యవసర అవసరాల కోసం బఫర్ స్టాక్‌గా నిల్వ ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు.

News February 9, 2026

NLG: ఆ పాఠశాలకు ఈ నెల 13 వరకు సెలవు

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా నల్గొండలోని నిడమనూరుకు చెందిన తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలకు ఈ నెల 11 నుంచి 13 వరకు సెలవును ప్రకటిస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పాఠశాలలో ఈ నెల 13న DVK, CDR, CTL మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు కౌంటింగ్ కేంద్రంగా ఈ పాఠశాలను ఎంపిక చేశారు.

News February 9, 2026

ఓయూలో నేడు, రేపు తెలుగు సాహిత్య మహాసభ

image

ఓయూలో నేడు, రేపు 2వ తెలుగు మహాసభ- 2026 జరగనుంది. ఆర్ట్స్ కాలేజీ 133 తరగతి గదిలో జరిగే కార్యక్రమంలో యువ కవులు, రచయితలు, నవలాకారులు, విమర్శకులు, సినిమా రచయితలు పాల్గొననున్నట్లు నిర్వాహకులు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ.కాశీం తెలిపారు. అలాగే ఆర్ట్స్ కాలేజీ ఎదుట సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నట్లు పేర్కొన్నారు.