News August 21, 2025
నూజివీడు ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం

నూజివీడులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న ట్రేడ్లలో అడ్మిషన్లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రజిత బుధవారం తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 21 నుంచి 26 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
ICOC చిత్తూరు ఛైర్మన్గా మనోజ్

ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (MSME) చిత్తూరు జిల్లా ఛైర్మన్గా చంద్రగిరి మనోజ్ కుమార్ నియమితులయ్యారు. రొంపిచర్ల(M) చంచంరెడ్డిగారిపల్లికి చెందిన ఈయన్ను BC కోటాలో నియమిస్తూ నేషనల్ జాయింట్ సెక్రటరీ సీమా కిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోSC, ST, మహిళా అభ్యున్నతికి, పథకాల ద్వారా ప్రయోజనం పొందేందుకు పాటుపడతానని మనోజ్ పేర్కొన్నారు.
News January 22, 2026
దారులన్నీ మేడారం వైపే!

వనదేవతల మహాజాతర సమయం ఆసన్నం కావడంతో దారులన్నీ మేడారం వైపే మళ్లుతున్నాయి. బుధవారం నుంచి శ్రీ సమ్మక్క-సారలమ్మల జాతర ఉత్సవాలు ‘మండ మెలగు’ వేడుకతో వైభవంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. రహదారులన్నీ వాహనాలతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్ల జాతర వైభవాన్ని కళ్లారా చూసేందుకు భక్తులు ఉత్సాహంగా పయనమవుతుండటంతో అటవీ ప్రాంతం జనసంద్రంగా మారింది.
News January 22, 2026
ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ అమ్మొద్దని వార్నింగ్

TG: మెడికల్ షాపుల ఓనర్లకు డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇచ్చింది. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్స్ విక్రయించవద్దని ఆదేశించింది. నిన్న రాష్ట్రవ్యాప్తంగా అలాంటి 190 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విచ్చలవిడిగా యాంటీ బయాటిక్స్ వాడితే ‘యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్’ బారినపడతారని, ఇది ప్రాణాంతకం అని తెలిపింది. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ అని స్పష్టం చేసింది.


