News December 1, 2025
నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన మంత్రి

ఉరవకొండ మండలం బూదిగవిలో రూ.43.75 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు.
Similar News
News February 13, 2026
‘అనంత బాలోత్సవం’ బ్రోచర్ ఆవిష్కరణ

అనంతపురంలోని SSBN కళాశాలలో ఈనెల 21, 22వ తేదీల్లో జరగనున్న ‘6వ అనంత బాలోత్సవం’ పోస్టర్ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆనంద్ బాబు ఆవిష్కరించారు. చిన్నారుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పరమేశ్, అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.
News February 13, 2026
అనంతపురం జిల్లాలో పదోన్నతులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీపీవో, డీఎల్పీవో కార్యాలయాల యూనిట్ నుంచి ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 నుంచి గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా ఐదుగురికి కలెక్టర్ ఆనంద్ పదోన్నతి కల్పించినట్లు DPO నాగరాజు నాయుడు తెలిపారు. పదోన్నతి పొందిన ఐదుగురు ఉద్యోగులకు త్వరలోనే పంచాయతీలు కేటాయిస్తామన్నారు.
News February 12, 2026
110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాల పంపిణీ

110 మంది గ్రామ రెవెన్యూ (గ్రేడ్-II) అధికారులు గ్రేడ్-Iగా పదోన్నతి పొందినట్లు జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలిపారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో 110 మంది ఉద్యోగులకు పదోన్నతి పత్రాలను అందజేశారు. పదోన్నతులు పొందిన ఉద్యోగస్తులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలన్నారు. పారదర్శకంగా విధులు నిర్వర్తించి లక్ష్యసాధనలో సత్ఫలితాలు సాధించాలన్నారు.


