News November 7, 2025
నెక్లెస్ రోడ్ ప్రాజెక్ట్..రాజభవన ద్వారం కూల్చివేతకు సిద్ధం

HYDలో 1892లో నిర్మించబడిన ఒక రాజ భవనం ద్వారం రోడ్డు మౌలిక వసతుల ప్రాజెక్టు కారణంగా త్వరలోనే అదృశ్యమవనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా భవనం ముందు భాగం మాత్రమే తొలగించనున్నప్పటికీ హుస్సేన్సాగర్ సరస్సును ఎదురుగా చూసే మరో చారిత్రక కోట బురుజు కూడా కూల్చివేయనున్నారు. నెక్లెస్ రోడ్ను రసూల్పుర రోడ్తో కలిపే ఈ రహదారి ప్రాజెక్టు కారణంగా నగరంలోని ఈ రెండు చారిత్రక నిర్మాణాలు త్వరలోనే చరిత్రలో భాగమవనున్నాయి.
Similar News
News January 24, 2026
సింగరేణి ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి సమావేశం

కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి శనివారం ఇల్లందు గెస్ట్ హౌస్లో సింగరేణి ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. బొగ్గు ఉత్పత్తి స్థాయి, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి, అలాగే సింగరేణి కార్మికుల సంక్షేమం గురించి రివ్యూ జరిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉత్పత్తి సాధించడం, అలాగే సింగరేణి సంస్థలు ఉన్న కీలక ప్రాజెక్టుల వేగవంతం చేయడం, స్థిరమైన అభివృద్ధి సాధించడంపై సీఎండీ ఉన్నతాధికారులతో చర్చించారు.
News January 24, 2026
మున్సిపల్ ఎన్నికలకు BRS ఇన్ఛార్జుల నియామకం

TG: త్వరలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమన్వయకర్తలను నియమించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారు. వీరు అభ్యర్థుల ఎంపిక, శ్రేణులను సమన్వయం చేయడం, ప్రచార వ్యూహాలను రచిస్తారు. ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తారు. ప్రజల మద్దతుతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు KTR పిలుపునిచ్చారు.
News January 24, 2026
పార్వతీపురం: రేపు జాతీయ ఓటర్ల దినోత్సవం

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు రేపు జిల్లా వ్యాప్తంగా “జాతీయ ఓటర్ల దినోత్సవం” వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఓటర్లలో చైతన్యం నింపేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 8 గంటలకు పార్వతీపురం ఆర్.సి.యం నుంచి భారీ అవగాహన ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు.


