News April 25, 2024

నెల్లిమర్లలో బడ్డుకొండ అనకొండగా మారారు: చంద్రబాబు

image

డెంకాడ మండలంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖలో రూ.500 కోట్లతో విలాసవంతమైన భవనం కట్టుకున్న సీఎం ప్రజలకు సెంట్ భూమి ఇచ్చాడంటా అంటూ ఎద్దేవా చేశారు. జగన్ రుషి కొండని మింగేస్తే బడ్డుకొండ అప్పలనాయుడు, నియోజకవర్గంలోని కొండలన్నీ మింగేసిన అనకొండ అన్నారు. తంగుడుబిల్లిలో సుమారు 10 ఎకరాల కొండని అనుచరులతో అక్రమంగా తవ్వేశారని అన్నారు.

Similar News

News April 18, 2026

VZM: ‘బీఎల్ఏలను త్వ‌ర‌గా నియ‌మించాలి’

image

రాజ‌కీయ పార్టీలు ప్ర‌తీ పోలింగ్ కేంద్రానికి త‌మ ప్ర‌తినిధులుగా బీఎల్‌ఏల‌ను నియ‌మించి, ఆ జాబితాను త్వ‌ర‌గా అంద‌జేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.స‌త్తిబాబు కోరారు. త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో శనివారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. బీఎల్ఎల‌ను నియ‌మించుకోవ‌డం ద్వారా ఎన్నిక‌ల ప్ర‌క్రియను స‌జావుగా, పార‌ద‌ర్శ‌కంగా పూర్తి చేసేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని అన్నారు.

News April 18, 2026

VZM: పైడితల్లమ్మ ఆలయం పనులు.. ఉత్తరాయణలోనే ప్రారంభించేలా చర్యలు

image

విజయనగరం పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 18, 2026

VZM: మే 5, 6,7 తేదీల్లో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు

image

రాష్ట్ర స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్ పోటీల (5వ ఏపీ కప్) పోస్టర్‌ను గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు దంపతులు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు శనివారం అశోక్ బంగ్లాలో ఆవిష్కరించారు. మే 5, 6,7 తేదీల్లో విజయనగరం రాజీవ్ స్టేడీయంలో ఈ పోటీలు జరగనున్నట్లు జిల్లా ఒలింపిక్, తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి, ఎమ్మెల్సీ గ్రీష్మ పాల్గొన్నారు.