News March 15, 2025
నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

నెల్లూరు జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. శనివారం జరిగిన పరీక్షల జనరల్ విభాగంలో 23,199 మందికి గాను 458 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఒకేషనల్ విభాగంలో 431 మందికి గాను 61 మంది గైర్హాజరు అయ్యారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా అధికారులందరికీ ఆర్ఐఓ ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News February 17, 2026
నెల్లూరు మేయర్గా మరోసారి మహిళకే ఛాన్స్!

నెల్లూరు మేయర్గా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత పేరు వినబడుతుంది. మాజీ మేయర్ స్రవంతిని అవిశ్వాసం పెట్టి దించిన తర్వాత.. అదే సామాజిక వర్గానికి చెందిన ఈమెను TDP తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. ఎస్టీ జనరల్కు కేటాయించినా.. మహిళకే ప్రాధాన్యం ఇస్తే ఈమె ముందు వరుసలో ఉంది. TDP తరఫున 47 మంది, YCP నుంచి ఏడుగురు మాత్రమే కార్పొరేటర్లు ఉన్నారు. వీరు 26న జరిగే సమావేశంలో మేయర్ను ఎన్నుకోనున్నారు.
News February 17, 2026
కనుపూరు ముత్యాలమ్మ జాతర ఎప్పుడో తెలుసా..

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ప్రసిద్ధిగాంచారు. ఈ జాతరకు ఏటా 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారు. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.
News February 17, 2026
నెల్లూరు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: RIO వరప్రసాద్

* ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
* నెల్లూరు జిల్లాలో 53,404 మంది ఇంటర్ విద్యార్థులు
* ఫస్ట్ ఇయర్ 26,935 మంది
* సెకండ్ ఇయర్ 26,469 మంది
* జిల్లాలో 81 పరీక్షా కేంద్రాలు
* 1150 మంది ఇన్విజిలేటర్ల నియామకం
* సిట్టింగ్ స్క్వాడ్స్ 5.. ఫ్లయింగ్ స్క్వాడ్స్ 4 ఏర్పాటు
* పరీక్షా సమయం 9AM నుంచి 12PM
* ఇప్పటికే విడుదలైన హాల్ టికెట్స్
*పరీక్షకు ఒకరోజు ముందే హాల్ టికెట్, సామాగ్రి సిద్ధం చేసుకోండి


