News December 2, 2025

నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

image

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.

Similar News

News February 18, 2026

నెల్లూరు: ఆ 6 గ్రామాల్లో సోలార్ సిస్టం

image

‘పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన’ కింద నెల్లూరు జిల్లాలో ఆరు పల్లెలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రకటించారు. తన ఛాంబర్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో తొలి విడతగా లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివేలపాలెం, మనుబోలు, కాకుపల్లిలో సోలార్ సిస్టం ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యుత్తు ఆదాతో పాటు ప్రజలకు ఆదాయం వస్తుందన్నారు.

News February 18, 2026

అలిపిరిలో పురాతన మండపం తొలగింపు

image

చాలామంది కాలినడకన తిరుమలకు వెళ్తారు. అలిపిరి వద్ద తొలి మెట్టు ఎక్కగానే కుడి వైపున పురాతన పాదాల మండపం ఉండేది. ఇకపై మీకు అది కనిపించదు. దీనిని పూర్తిగా తొలగించారు. పుణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర ఛారిటబుల్ అండ్ రిలీజియస్స్ ట్రస్ట్ నేతృత్వంలో ఆర్కియాలజీ అధికారులు పర్యవేక్షణలో మండలంలోని దూలాలు, స్తంభాలను జాగ్రత్తగా తొలగించి భద్రపరిచారు. తొలగించక ముందు, ఆ తర్వాత ఎలా ఉందో పై ఫొటోలో చూడవచ్చు.

News February 18, 2026

నెల్లూరు: రిజిస్ట్రార్ బాలాంజనేయులు బదిలీ..!

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసఫ్‌ను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. ఈయన బాధ్యతలు తీసుకునే వరకు ప్రకాశం జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో రవి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.