News January 26, 2025
నెల్లూరు: 3 రంగుల పతాకం ఆకారంలో చిన్నారులు

నెల్లూరు జిల్లా చేజర్లలోని లుంబిని విద్యాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆకారంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కూర్చున్నారు. కాగా ఈ జెండా ఆకారం పలువురిని ఆకట్టుకుంది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు గొప్పగా వివరించారు.
Similar News
News February 8, 2025
నెల్లూరు: ఇంజెక్షన్ వేస్తున్నట్లు నటించి నగలు చోరీ.. అరెస్ట్

నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్లోని ఓ వ్యక్తికి అనారోగ్యంగా ఉండడంతో ఇంజెక్షన్ వేసేందుకు కార్తీక్ అనే కాంపౌండర్ వచ్చాడు. ఇంజెక్షన్ వేస్తున్నట్లు నటిస్తూ సమీపంలో బంగారు ఆభరణాలు గమనించి చోరీకి పాల్పడ్డాడు. బంగారం దొంగిలించినట్లు గమనించిన ఉదయ శేఖర్ రెడ్డి దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులో తీసుకొని 95 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
News February 8, 2025
నేడు కావలిలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటన

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. కలెక్టర్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కావలి సెల్ఫీ పాయింట్ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటలకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వెంగళరావునగర్లో ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఇందిరమ్మ కాలనీలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు.
News February 7, 2025
నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వినూత్న ఆలోచన

నెల్లూరు పరిధిలో చెత్త సేకరణ వాహనాలకే వ్యర్థాలను అందించాలని ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేస్తున్నారు. అలాంటి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ వినూత్నంగా ఆలోచించారు. వ్యర్థాలు వేస్తున్న ఆ ప్రదేశాన్ని పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శుభ్రం చేయించారు. రంగు రంగుల ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు.