News May 2, 2024
నెల్లూరు: 41.7 డిగ్రీల ఎండతో జనం విలవిల

నెల్లూరులో బుధవారం 41.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతకు జనం విలవిలలాడుతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యప్రతాపం తీవ్రమవుతుండటంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. 11 గంటలకు ఖాళీ అవుతున్న రోడ్లు తిరిగి సాయంత్రం 5 గంటల తర్వాతే రాకపోకలతో రద్దీగా కనిపిస్తున్నాయి. రోడ్ల పక్కన చిరువ్యాపారులు చేసుకునేవారు. రోజు కూలీలు మాత్రం విధిలేని పరిస్థితుల్లో ఎండలోనే జీవన పోరాటం సాగిస్తున్నారు.
Similar News
News December 17, 2025
నెల్లూరు: ప్రాణాలు పోతున్నా.. చలించరా..?

ప్రాణాపాయం కేసులను ఒకవేళ అడ్మిట్ చేసుకుంటే చికిత్సలో ప్రాణాలు పోతే తమపైకి వస్తుందేమోననే నెపంతో వైద్యులు రిస్క్ తీసుకోకుండా రెఫర్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో వసతులు, వైద్యుల కొరత ఉండడంతో GGHకి రెఫర్ చేస్తున్నారు. జిల్లాలో 108 ద్వారా వచ్చిన అత్యవసర కేసులు పరిశీలిస్తే Sep (3063),OCT(3340), NOV(3024), DEC(559) రాగా.. వీటిల్లో SEP(496), OCT(573), NOV(662), DEC(157) కేసులను వేరే ఆసుపత్రులకు రెఫర్ చేశారు.
News December 17, 2025
గోవా నుంచి తిరుపతికి.. అక్కడ నుంచి నెల్లూరుకి..

నెల్లూరు కార్పొరేషన్కి చెందిన 40 మంది కార్పొరేటర్లు కుటుంబ సభ్యులతో గోవాలో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. వారు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గోవా నుంచి తిరుపతికి రానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం నేరుగా కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకుంటారు. రేపు కార్పొరేషన్ ఆఫీస్లో సమావేశం ఉంటుంది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మేయర్ రాజీనామాకు ఆమోదం తెలపనున్నారు.
News December 17, 2025
లింగసముద్రం: గుండెపోటుతో హోంగార్డు మృతి

లింగసముద్రం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న కొండలరావు గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి బైక్పై విధి నిర్వహణకు పోలీస్ స్టేషన్కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.


