News December 23, 2024
నేటితో 136వ వసంతంలోకి సింగరేణి
సింగరేణి అంచెలంచలుగా ఎదుగుతూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. నేడు 135 వసంతాలు పూర్తిచేసుకుని 136వ వసంతంలోకి అడిగెడుతోంది. రామగుండంలో 1937 సంవత్సరంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొదటగా హైదరాబాద్ దక్కన్ కంపెనీతో ఏర్పాటైన ఈ సంస్థ.. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చారు. అప్పటినుంచి ప్రతియేటా డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News January 20, 2025
ఈనెల 28న కొత్తకొండ హుండీల లెక్కింపు
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు
News January 19, 2025
సిరిసిల్ల: కూతురితో గొడవ.. తల్లి ఆత్మహత్య
ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వేముల నర్సవ్వ (45) ఇంట్లో కూతురితో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెంది ఎదురుగా ఉన్న ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నర్సవ్వ కుమారుడు శేఖర్ ఆదివారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.
News January 19, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,49,539 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,31,444 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.95,765, అన్నదానం రూ.22,330,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.