News September 10, 2025
నేడు అనంతపురానికి CM చంద్రబాబు

★ నేడు మ.12 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో అనంతపురం బయలుదేరుతారు
★ మ.1.30కి అనంతపురం చేరుకుంటారు
★ అనంతరం మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం
★ మ.2-సా.4.30 వరకు ఇంద్రప్రస్థ మైదానంలో జరిగే ‘సూపర్-6-సూపర్ హిట్’ సభలో పాల్గొని ప్రసంగం
★ సభ ముగిశాక ఉండవల్లికి తిరుగుపయనం
▶ అనంతపురానికి సీఎం, డిప్యూటీ సీఎం, కూటమి ఎమ్మెల్యేలందరూ వస్తుండటంతో 6 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News December 10, 2025
ఈనెల 31 వరకే వీటికి గడువు

2025 ఎండింగ్కి వస్తుండటంతో పలు ఆర్థిక సంబంధిత గడువులు దగ్గరపడుతున్నాయి. ఈనెల 31లోపు పూర్తి చేయకపోతే జరిమానాలు, సేవల నిలిపివేత వంటి ఇబ్బందులుంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
1. ముందస్తు పన్ను 3వ విడత చివరి తేదీ ఈనెల 15
2. బిలేటెడ్ ITR దాఖలకు 31 చివరి తేదీ
3. పాన్-ఆధార్ లింక్ డిసెంబర్ 31లోపు తప్పనిసరి
4. PM ఆవాస్ యోజన దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31
5. రేషన్ కార్డు e-KYC
News December 10, 2025
WGL: నా గుర్తు స్టూల్.. ఇదిగో నీకో కుర్చీ..!

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ల్యాబర్తీ గ్రామంలో ఓటర్లను ఆకర్షించేందుకు వార్డు అభ్యర్థులు తగ్గేదేలే అంటున్నారు. మొన్నటికి మొన్న ఓ పార్టీ క్వార్టర్ మందు ఇస్తే మరో పార్టీ అర కిలో చికెన్ ఇచ్చి ఆకర్షించింది. ఇక మరో వార్డు అభ్యర్థి తనకు గుర్తు కుర్చీ కేటాయించడంతో ఏకంగా ఓటర్లకు కుర్చీలను పంచి పెట్టడం వైరల్గా మారింది. ఆటోలో ఇంటింటికీ తిరుగుతూ ఒక్కో ఓటుకు ఒక్కో కూర్చి ఇచ్చి తన గుర్తు ఇదే అంటున్నాడు.
News December 10, 2025
తూగో: కోళ్ల ఓనర్స్ గుండెల్లో గూడ్స్ రైళ్లే..!

సంక్రాంతి సమీపిస్తున్న వేళ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. కొనుగోలుదారుల రూపంలో వచ్చి పుంజుల రంగు, జాతిని పరిశీలించి, అదను చూసి రాత్రి వేళల్లో వాటిని మాయం చేస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెంలో భారీగా కోళ్లు చోరీకి గురయ్యాయి. రూ.వేల విలువైన కోళ్లకు కాపలా కాసేందుకు యజమానులకి కునుకు లేకుండా పోతోంది. మరోవైపు ఆన్లైన్లోనూ కోళ్ల ఫోటోలు పెట్టి అడ్వాన్సుల పేరుతో మోసగిస్తున్నారు.


