News December 1, 2025
నేడు అమలాపురంలో యథావిధిగా PGRS: కలెక్టర్

అమలాపురంలోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా వేదిక నిర్వహిస్తామన్నారు. స్వీకరించిన అర్జీని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 10, 2026
డిజిటల్ లావాదేవీల పై అప్రమత్తత అవసరం: కలెక్టర్

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన పొందాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. RBI ఫిబ్రవరి 9 నుంచి 13వ వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం పోస్టర్లను కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సురక్షిత బ్యాంకింగ్ విధానాలు పాటించడం, డిజిటల్ లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు.
News February 10, 2026
GWL: ఈనెల 12 నుంచి జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు

సీఎం కప్ 2025-26 జిల్లాస్థాయి పోటీలు గద్వాల ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి కృష్ణయ్య మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 12, 13, 16, 17 తేదీల్లో వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తామన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు తప్పక పాల్గొనాలన్నారు. మరిన్ని వివరాలకు 98854 79896, 99593 44234 నంబర్లను సంప్రదించాలన్నారు.
News February 10, 2026
ADB: ఈ నెల 20 వరకు పత్తి కొనుగోళ్లు

సీసీఐ కేంద్రాలలో కొనుగోలు చేస్తున్న పత్తి ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే కొనుగోలు చేస్తామని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి తెలిపారు. రైతులు పత్తి అమ్మెందుకు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకొవాలని సూచించారు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రైతులకు వీలులేదన్నారు. పత్తి నిల్వ ఉన్న రైతులు తప్పకుండా త్వరగా సీసీఐలో విక్రయించి మద్దతు ధర పొందాలని వివరించారు.


