News December 1, 2025
నేడు అమలాపురంలో యథావిధిగా PGRS: కలెక్టర్

అమలాపురంలోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా వేదిక నిర్వహిస్తామన్నారు. స్వీకరించిన అర్జీని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News February 18, 2026
చిత్తూరు: స్నేక్ రెస్క్యూపై ప్రత్యేక చర్యలు.!

పాముల సంరక్షణపై అటవీశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘సర్పమిత్ర’ కార్యక్రమంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి HWC హాట్స్పాట్స్లో పాములను కాపాడే విధంగా ప్రణాళిక రూపొందించింది. టీమ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్పమిత్ర ట్రైనర్లుగా నియమించనున్నారు. నిపుణులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్నేక్ రెస్క్యూ సర్టిఫికేషన్ కోర్సు ప్రారంభించి, పాముల పట్టివేత, సురక్షిత హ్యాండ్లింగ్పై ప్రొటోకాల్ రూపొందించనున్నారు.
News February 18, 2026
కూరగాయలు తాజాగా ఉండాలంటే?

కూరగాయలు తాజాగా ఉండటానికి జపనీయులు కాటన్, మస్లిన్ వస్త్రంలో చుట్టేస్తారు. ఆకుకూరలను కాస్త తడిపిన క్లాత్లో చుట్టి ఫ్రిడ్జ్లో ఉంచుతారు. అలాగే ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టాలి అనుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగి, తుడిచి పొడిగా ఉన్నప్పుడే పెట్టాలి. పండిపోయినవి త్వరగా వాడేయాలి. లేదంటే వాటి ప్రభావం వేరే కూరగాయలపై పడుతుంది. అలాగే టైట్ కవర్లో కూరగాయలు పెట్టడం వల్ల తర్వరగా పాడైపోతాయి.
News February 18, 2026
డిన్నర్ ఎప్పుడు చేస్తున్నారు?

నిద్ర పోయే 3 గంటల ముందే భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు 3.5%, హార్ట్ బీట్ 5% తగ్గుతాయని చెబుతున్నారు. ‘ఆలస్యంగా తినడం వల్ల శరీరం జీర్ణక్రియలోనే నిమగ్నమైపోతుంది. ‘మెదడు క్లీనింగ్’ ప్రాసెస్కూ ఆటంకం ఏర్పడుతుంది. ఆహారం మార్చకుండా, కేవలం సమయం మార్చడం ద్వారా మీ ఆయుష్షును పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇలా చేయండి’ అని తెలిపారు. share it


