News December 2, 2025

నేడు ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సీఎం రాక

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో కలిసి ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Similar News

News February 18, 2026

అశ్వ వాహనంపై ఆదిదంపతులు

image

శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఉత్సవాల చివరి రోజున శివపార్వతులు అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రికి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంత సేవ కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా ముగియనున్నాయి.

News February 18, 2026

రంజాన్ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్యం , నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు.

News February 18, 2026

వేసవి కార్యాచరణ సిద్ధం చేయాలి: కామారెడ్డి కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’ సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.