News August 20, 2025
నేడు ఒంగోలుకు వందేమాతరం శ్రీనివాస్

ఒంగోలులో నేటి నుంచి 24 వరకు కళా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్ తెలిపారు. మంగళవారం ఒంగోలులోని పీవీఆర్ హైస్కూల్ ఆవరణంలో కళా ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్ను వారు విడుదల చేశారు. బుధవారం కళా ఉత్సవాల ప్రారంభోత్సవానికి సినీ రంగ ప్రముఖులు వందేమాతరం శ్రీనివాస్, గోరేటి వెంకన్న, తమ్మారెడ్డి భరద్వాజ, ఏపూరి సోమన్న పలువురు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News January 21, 2026
మార్కాపురం జిల్లాలో దారుణ హత్య.!

మార్కాపురం జిల్లాలో బుధవారం రాత్రి దారుణ హత్య జరిగింది. పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. లాలూ అనే వ్యక్తిని భార్య, బావమరిది కత్తులతో పొడిచి చంపినట్లు సమాచారం. హత్య చేసిన అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పెద్దారవీడు పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 21, 2026
జనవరి చివరి వారంలో వెలిగొండకు CM.!

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చేయనున్నట్లు వెళ్తున్నారు.
News January 21, 2026
23న వెలిగొండకు మంత్రి నిమ్మల.. నెలాఖరుకు CM

ఈనెల 23 ఉదయం 9గంటలకు మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్, ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించనున్నారు. మంత్రి కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది. ఈనెల చివరి వారంలో CM చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు సందర్శించి ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ పనులకు భూమిపూజ చేయనున్నాట్లు సమాచారం. దీనిపై మంత్రి ముందస్తు ఏర్పాట్లను చూసేందుకు వెళ్తున్నారు.


