News November 16, 2025

నేడు కోరుట్లలో ఉమ్మడి జిల్లా స్థాయి ఖోఖో పోటీలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి 18 సంవత్సరాల లోపు బాలబాలికల ఖోఖో టోర్నమెంట్ కం సెలక్షన్స్ నేడు కోరుట్ల కాలేజ్ గ్రౌండ్‌లో జరగనున్నాయి. కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 30 వరకు మెదక్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొననున్నారు. క్రీడాకారులందరూ సకాలంలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

Similar News

News January 14, 2026

విజయ్ మాతో పొత్తు పెట్టుకో.. బీజేపీ ఆఫర్

image

తమిళనాడులో తమతో పొత్తు పెట్టుకోవాలని TVK పార్టీని బీజేపీ ఆహ్వానించింది. వచ్చే ఎన్నికల్లో DMK గెలిచే అవకాశమే లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాల్సిన అవసరం ఉందని BJP నేత అన్నామలై అన్నారు. డీఎంకే వ్యతిరేక పార్టీలన్నీ కలవాల్సిన అవసరం ఉందని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కాగా బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అంతకుముందు TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తేల్చి చెప్పారు.

News January 14, 2026

బాపట్లలో రాష్ట్రస్థాయి ఎడ్ల ప్రదర్శన

image

సంక్రాంతి సందర్భంగా బాపట్లలో 16వ రాష్ట్రస్థాయి ఎడ్ల ప్రదర్శన బుధవారం ప్రారంభమైంది. బీమావారిపాలెం రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మున్నంవారిపాలెం రోడ్డులో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్, డీఎస్పీ రామాంజనేయులు పోటీలను ప్రారంభించారు. పండగ పూట నిర్వహించిన ఈ ప్రదర్శనను తిలకించేందుకు జనం ఆసక్తి చూపారు.

News January 14, 2026

ఫేక్ రిఫండ్లతో ₹5 కోట్లు కొల్లగొట్టాడు

image

e-కామర్స్ ప్లాట్‌ఫాంల రిటర్న్ సిస్టమ్ లూప్‌హోల్స్‌ను ఆసరా చేసుకొని ఓ యువకుడు రిఫండ్ కింద ఏకంగా ₹5Cr కొల్లగొట్టాడు. చైనాలో లూ అనే వ్యక్తి కాస్మొటిక్ షాపింగ్ ప్లాట్‌ఫాంలో 11900 ఫేక్ రిఫండ్ రిక్వెస్టులు పెట్టాడు. తనకు వచ్చిన వస్తువుల్ని తిరిగి సెకండ్స్ కింద మార్కెట్లో అమ్మేవాడు. 2024లో రిఫండ్‌లపై అనుమానంతో ఓ కంపెనీ ఫిర్యాదు చేయగా స్కామ్ బయటపడింది. చివరకు కోర్టు అతనికి 6ఏళ్ల జైలుశిక్ష విధించింది.