News April 10, 2024
నేడు జగిత్యాలకు KCR

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జగిత్యాల పట్టణానికి రానున్నారు. MLA డాక్టర్ సంజయ్ కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవాది మాకునూరి హనుమంతరావు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో నేడు ఓ గార్డెన్స్లో జరిగే 13వ రోజు(స్వర్గ పాత్ర) కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్టు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు.
Similar News
News December 14, 2025
కరీంనగర్లో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ

గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. జిల్లాలోని ఐదు మండలాల్లో జరుగుతున్న పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని, 162 క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోని స్క్రీన్లపై పోలింగ్ ప్రక్రియను వీక్షించిన కలెక్టర్, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పర్యవేక్షించారు.
News December 14, 2025
లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్గా నీలం చంద్రారెడ్డి గెలుపు

తిమ్మాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నీలం చంద్రారెడ్డి గెలుపొందారు. ఆయన తన సమీప అభ్యర్థి కరివేద శ్యాంసుందర్ రెడ్డిపై 34 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. స్వల్ప మెజార్టీతో గెలుపొందిన చంద్రారెడ్డికి గ్రామస్థులు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మద్దతుదారు గెలుపొందడంతో లక్ష్మీదేవిపల్లిలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
News December 14, 2025
కరీంనగర్ జిల్లాలో 84.63% పోలింగ్ నమోదు

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 84.63% పోలింగ్ కాగా, చిగురుమామిడిలో 85.82%. గన్నేరువరంలో 88.55%, మానకొండూరులో 82.34%, శంకరపట్నంలో 84.98%, తిమ్మాపూర్ లో 84.83% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 185003 ఓట్లకు గాను 156568 ఓట్లు పోలయ్యాయి.


