News November 19, 2025
నేడు పుట్టపర్తికి ప్రధాని.. షెడ్యూల్ ఇదే..!

శ్రీ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇవాళ ప్రధాని మోదీ పుట్టపర్తికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుని, బాబా మహా సమాధిని సందర్శిస్తారు. 10:30 గంటలకు జరిగే శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా గౌరవార్థం ఒక స్మారక నాణెం, ప్రత్యేక స్టాంపులను విడుదల చేసి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బయలుదేరి వెళతారు.
Similar News
News January 13, 2026
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు
> జనగామ: మున్సిపల్ ఓటర్ జాబితా విడుదల
> జనగామ జిల్లాలో తీసేసి యోచనలో ప్రభుత్వం ఉంది: ఎమ్మెల్యే
> చింతగట్టు జాతరపై ఎమ్మార్వో సమీక్ష సమావేశం
> రాష్ట్రంలో పనిచేసే సీఎం ఉన్నారు: కడియం
> దేవరుప్పులలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ
> రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి: కలెక్టర్
> యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: కలెక్టర్
News January 13, 2026
సిద్దిపేట: డిస్పోజల్ ప్రక్రియ వేగవంతం చేయండి: కలెక్టర్

భూ భారతి అవగాహన సదస్సులలో మండలాల్లో స్వీకరించిన దరఖాస్తుల డిస్పోజల్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం ఆర్డీవోలు, తహశీల్దార్లు ఇతర రెవెన్యూ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. అలాగే బీఎల్ఒలు ఎలక్ట్రోల్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
News January 13, 2026
మేడారంలో రాత్రి షిఫ్ట్ పనులు పరిశీలించిన కలెక్టర్

సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ దివాకర మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ రాత్రి షిఫ్ట్లో జరుగుతున్న క్యూలైన్, ఆలయ పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, ట్రైనీ ఆర్డీఓ, ఆర్ అండ్ బీ ఈఈ సురేశ్ పాల్గొన్నారు.


