News February 18, 2025
నేడు పెద్దగట్టు జాతరలో చంద్రపట్నం

పెద్దగట్టు జాతరలో నేడు మూడోరోజు చంద్రపట్నం వేసి స్వామివారి కళ్యాణం నిర్వహించేందుకు దేవాలయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Similar News
News April 16, 2026
చిత్తూరు జిల్లాలో కొత్త కార్యక్రమం

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం జలధార కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 3,106 చెరువులు ఉన్నాయి. జలధార కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతున్న మండలాలకు ప్రాధాన్యమిచ్చి.. దానిని 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేస్తారు.
News April 16, 2026
చిత్తూరు జిల్లాలో కొత్త కార్యక్రమం

చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం జలధార కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం 100 రోజుల ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 3,106 చెరువులు ఉన్నాయి. జలధార కార్యక్రమాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతున్న మండలాలకు ప్రాధాన్యమిచ్చి.. దానిని 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేస్తారు.
News April 16, 2026
నారాయణపేట: జీతాలు ఇవ్వకుంటే విధుల బహిష్కరణ

నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయాలని కోరుతూ నారాయణపేట జిల్లా సాంకేతిక సహాయకుల జేఏసీ ప్రతినిధులు జిల్లా డీఆర్డివో మొగులప్పకు వినతిపత్రం అందజేశారు. వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే మంగళవారం నుంచి పెన్డౌన్ నిర్వహిస్తామని జిల్లా నాయకులు హర్షవర్ధన్,గౌరీశంకర్, ఊషన్న, శంకర్ తెలిపారు.


