News November 19, 2025
నేడు బాపట్ల జిల్లా రైతుల ఖాతాల్లో రూ.107.21కోట్లు జమ!

బాపట్ల జిల్లాలోని సుమారు 1,60,441 రైతుల అకౌంట్లలోకి అన్నదాత సుఖీభవ 2వ విడత రూ.5,000, పీఎం కిసాన్ 21వ విడత రూ.2,000 కలిపి మొత్తంగా రూ.7,000లు బుధవారం జమ కానున్నాయి. ఈ మేరకు జిల్లా ఇన్ఛార్జి డీఏవో కె.అన్నపూర్ణమ్మ వివరాలను మంగళవారం వెల్లడించారు. జిల్లాలోని 25 మండలాల్లోని రైతులకు రూ.107.21 కోట్ల లబ్ధి చేకూరనున్నట్లు ఆమె తెలిపారు.
Similar News
News January 20, 2026
MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై MBNR జిల్లా అదనపు ఎస్పీకి మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగిన మహాసభలో రాష్ట్ర సీఎం బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, సీఎం హోదాలో ఉండి ఈ విధంగా చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.
News January 20, 2026
MSVPG హిట్.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్

MSVPG హిట్ కావడంతో ప్రేక్షకులను ఉద్దేశించి చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘మూవీపై ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణతో నా మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోంది. మీరు లేనిదే నేను లేను. ఈ విజయం తెలుగు ప్రేక్షకులది. స్క్రీన్పై నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే శక్తి. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై చూపించే ప్రేమ శాశ్వతం. మూవీ టీంకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News January 20, 2026
తనిఖీల్లేవ్.. చర్యల్లేవ్.. అంతా సవ్యమేనా?

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లోని పలు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయి. వాణిజ్య అవసరాలకు వాడాల్సిన కమర్షియల్ సిలిండర్లకు బదులుగా, తక్కువ ధరకు లభించే గృహ వినియోగ సిలిండర్లను వినియోగిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి కనీసం తనిఖీలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆకస్మిక దాడులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


