News May 7, 2025
నేడు రాజధాని ప్రాంతంలో సీపీఎం పర్యటన

రాజధాని ప్రాంతంలో శనివారం CPM సీనియర్ నేత బాబురావు ఆయన బృందంతో పర్యటించనున్నారు. అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములను పరిశీలించి ఎంత మేరకు నిర్మాణాలు జరిగాయని మీడియాతో మాట్లాడనున్నట్లు CPM నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మే నెల 2వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో CPM ఈ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 11, 2026
స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

స్వర్ణ ఆంధ్ర @ 2047లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అన్నీ శాఖలు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) పై వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ కార్యాలయంలో బుధవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. కీలక పనితీరు సూచికలను (KPIలు) సాంకేతికత ఆధారిత పనితీరుపై పర్యవేక్షణ జరుగుతుందన్నారు.
News February 11, 2026
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర @2047లో భాగంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్పై అధికారులకు కలెక్టరేట్లో బుధవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. కీలక పనితీరు సూచికలను సాంకేతికత ఆధారిత పనితీరును పర్యవేక్షణ జరుగుతుందన్నారు. ఆర్థిక, సామాజిక కొలమానాలు, లాజిస్టిక్స్, మానిటరింగ్ మెకానిజం అభివృద్ధి చేసుకోవాలన్నారు.
News February 11, 2026
ANU దూరవిద్య పరీక్షల్లో పకడ్బందీ నిఘా

ఆచార్య నాగార్జున వర్సిటీ దూరవిద్య పరీక్షలను పటిష్ఠంగా నిర్వహిస్తున్నట్లు పరీక్షల సమన్వయకర్త రామచంద్రన్ తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు రాష్ట్రవ్యాప్తంగా ఏడు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కేంద్రంలో కాపీయింగ్కు పాల్పడుతున్న 9 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యార్థులను హెచ్చరించారు.


