News April 22, 2024

నేడు సంగారెడ్డి రానున్న కేంద్ర మంత్రి

image

జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి బి.బి.పాటిల్ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరవుతారని పార్టీ నాయకులు తెలిపారు. సంగారెడ్డిలోని గణేష్ గడ్డ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News December 15, 2025

శివంపేట: ఓట్ల కోసం బట్టలు ఉతుకుతూ ప్రచారం

image

శివంపేట మండలం అల్లీపూర్ గ్రామ 1వ వార్డులో వార్డు సభ్యురాలి భర్త చాకలి బాబు వినూత్నంగా ప్రచారం చేశారు. తన భార్య తరఫున ప్రచారం నిర్వహిస్తూ ఇంటింటికి వెళ్లి మహిళలతో కలిసి బట్టలు ఉతుకుతూ, గ్రామంలోని సమస్యలపై చర్చిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఈ వింత ప్రచారం అల్లీపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

News December 14, 2025

MDK: 2 ఓట్లతో స్వప్న విజయం

image

నిజాంపేట మండలం నందిగామలో బీజేపీ మద్దతుదారు షేరి స్వప్న 2 ఓట్ల మెజారిటీతో విజయకేతనం ఎగురవేశారు. గ్రామంలో వారి మద్దతుదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుపోతామని వారు పేర్కొన్నారు. నమ్మకంతో గెలిపించిన గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 14, 2025

MDK: 4 ఓట్లతో కనకరాజు విజయం

image

నిజాంపేట మండల పరిధిలోని రజాక్ పల్లిలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి సునీతపై బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వోజ్జ కనకరాజు 4 ఓట్లతో విజయం సాధించాడు. మండలంలో బీఆర్ఎస్ మొదటి విజయంతో ఖాతా ఓపెన్ చేయడం విశేషం. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందడంతో గ్రామంలో గ్రామస్థులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అభ్యర్థి తెలిపారు.