News November 6, 2025

నేడు స్పీకర్ వద్ద విచారణకు భద్రాచలం MLA

image

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. BRSలో గెలిచి అధికార కాంగ్రెస్‌లో చేరిన ఆయనకు సంబంధించి అనర్హత పిటిషన్‌పై విచారణ నేడు జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ ఏడాది ఆగస్టు 23న దీనికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. నేడు(గురువారం) జరగబోయే విచారణతో ఎమ్మెల్యే వెంకటరావు రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందోనని జిల్లాలో చర్చ మొదలైంది.

Similar News

News January 19, 2026

ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి డబ్బులు

image

AP: 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు 41.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే 94% నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక నుంచి ఉదయం కొనుగోలు చేస్తే సాయంత్రానికే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. మరోవైపు నేతన్నలకు మొదటి విడత త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67కోట్లు జమ చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు.

News January 19, 2026

బాపట్ల: ఉచిత పశుఆరోగ్య శిబిరాల ఏర్పాటు

image

బాపట్ల జిల్లా వ్యాప్తంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు సోమవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఉచిత పశు ఆరోగ్య వైద్య శిబిరాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ వైద్య శిబిరంలో గర్భనిర్ధారణ పరీక్షలు, నట్టల నివారణ మందులతోపాటు వ్యాధి నివారణ టీకాలు వెయ్యనున్నట్లు వివరించారు.

News January 19, 2026

SRCL: ‘అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి’

image

మైనార్టీ విద్యాలయాల ప్రవేశాల పోస్టర్లను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆవిష్కరించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం టీజీఎంఆర్ఐఎస్ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.