News November 19, 2025
నేడే రైతు ఖాతాలో 2వ విడత నగదు జమ: కలెక్టర్

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ఇవాళ (మంగళవారం) రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఆదేశించారు.
Similar News
News January 23, 2026
ఫిబ్రవరి నాటికి పనులు ప్రారంభం కావాలి: కలెక్టర్

పెండింగ్లో ఉన్న పీఎం కుసుమ్ పనులను ఫిబ్రవరి మొదటి వారం నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సిరి విద్యుత్ శాఖ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కాంట్రాక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు. పీఎం సూర్య ఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఏప్రిల్ నాటికి 23,000 సోలార్ ఇన్స్టాలేషన్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు.
News January 23, 2026
పర్యావరణ పరీక్షకు 782 విద్యార్థుల గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పర్యావరణ విద్య పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆర్ఐఓ లాలప్ప తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా మొత్తంగా 26,465 హాజరు కావలసి ఉండగా.. 25,683 విద్యార్థులు హాజరయ్యారన్నారు. 782 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. పరీక్షను ఇంటర్ బోర్డు ఆర్జేడీ (కడప) డాక్టర్ సురేశ్ బాబు పర్యవేక్షించారు.
News January 23, 2026
కర్నూలు: ‘వచ్చే నెల 19 వరకు టైం ఉంది. అప్లై చేసుకోండి’

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అధికారి శ్రీదేవి తెలిపారు. 5వ తరగతి, ఇంటర్మీడియట్ (ఆంగ్ల మాద్యమం) మొదటి సంవత్సరంలో చేరేందుకు అభ్యర్థులు https://apbragcet.apcfss.in/లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 20వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని, వచ్చే నెల 19వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు.


