News November 19, 2025
నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.
Similar News
News January 23, 2026
నేడు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు

AP: రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ఇవాళ ప్లాట్లు కేటాయించేందుకు CRDA ఏర్పాట్లు చేసింది. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఇ-లాటరీ ద్వారా అందజేయనుంది. మొత్తం 15 గ్రామాల్లోని 291 మందికి స్థలాలు ఇవ్వనుంది. 14 గ్రామాల రైతులకు 11AMకు, ఉండవల్లిలో మెట్టభూములిచ్చిన వారికి 3PMకు కేటాయించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూములు ఇచ్చిన, ఉండవల్లిలో జరీబు భూములిచ్చిన రైతులకు త్వరలో ప్లాట్లు ఇవ్వనుంది.
News January 23, 2026
గ్రామ ప్రియ కోళ్ల గురించి తెలుసా?

గ్రామ ప్రియ కోళ్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్లు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆరు నెలల వయసు వచ్చేసరికే రెండున్నర కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఏడాదిలో 250 గుడ్లను పెడతాయి. అధిక వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడవని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.
News January 23, 2026
జేడ్ రోలర్తో మెరిసే చర్మం

అలసిన ముఖానికి సాంత్వన కలిగించే అద్భుతమైన పరికరం జేడ్ రోలర్. ముఖాన్ని శుభ్రం చేసి రోజ్వాటర్ అద్దాలి. తర్వాత జేడ్ రోలర్తో సవ్య, అపసవ్య దిశల్లో మసాజ్ చేయాలి. రోజుకి మూడుసార్లు మసాజ్ చేస్తే చర్మంపై లింఫాటిక్ ఫ్లూయిడ్ విడుదల తగ్గుతుంది. మసాజ్ చేయడంవల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ జరిగి, ఆక్సిజన్ అంది చర్మం కాంతివంతం అవుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గి, చర్మం తాజాగా ఉంటుంది.


