News September 11, 2025
నేపాల్లోని నెల్లూరు జిల్లా వాసులకు రక్షణ : కలెక్టర్

నేపాల్లో చిక్కుకున్న నెల్లూరు జిల్లా వాసులకు రక్షణగా ప్రభుత్వం నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లా వాసులు ఎవరైనా నేపాల్లో ఉంటే వారి వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్లో తెలియపరచాలని కోరారు. వారి కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News December 9, 2025
నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.
News December 9, 2025
నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.
News December 9, 2025
గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

నగరంలో నిన్న సాయంత్రం బోసు బొమ్మ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్ను తీయమన్నందుకు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్పై బ్లేడ్తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సంతపేట పోలీసులు గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. నిందితులకు నేర చరిత్ర లేదని, క్షణికావేశంలో ఈ ఘటన జరిగిందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపట్ల నగరవాసులు అభినందనలు తెలిపారు.


