News April 25, 2024

పంగులూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

పంగులూరు మండలం కొండ మంజులూరు పాలకేంద్రం వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముప్పవరంకి చెందిన కిషోర్, అద్దంకికి చెందిన చందు, ముండ్లమూరుకి చెందిన ప్రవీణ్ లు ద్విచక్ర వాహనంపై ముప్పవరం వైపు వెళుతున్నారు. ఈ క్రమంలో వాహనం చెడిపోవడంతో దానిని టోల్ ప్లాజా వద్ద ఉంచారు. అనంతరం నడిచి వెళుతున్న వారిని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిషోర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News April 14, 2026

ప్రకాశం: మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం

image

మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు బస్టాండ్ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు టైరు పగలడంతో అదుపు తప్పి డివైడర్ మీదకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమి కాలేదు. తరచూ ట్రావెల్ బస్సులు ప్రమాదాలకు గురవటం ఒకింత ఆందోళనకు గురి చేస్తుంది.

News April 14, 2026

బాలికపై అత్యాచారం.. నిందితుడికి జైలుశిక్ష: ప్రకాశం ఎస్పీ

image

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు POCSO కోర్టు తీర్పు వెలువరించింది. దొనకొండ మండలానికి చెందిన వ్యక్తి 14 ఏళ్ల బాలికను మాయమాటలతో హైదరాబాద్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. పోలీసుల దర్యాప్తుతో నేరం రుజువై శిక్ష విధించగా.. సంబంధిత అధికారులను ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీసులను అభినందించారు.

News April 14, 2026

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

image

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. 95% సైబర్ దాడులు నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని సోమవారం తెలిపారు. అనుమానాస్పద మెయిల్స్‌లోని లింకులను క్లిక్ చేయకూడదన్నారు. ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించకపోవడం మంచిదని ప్రజలకు సూచించారు.