News February 18, 2025
పంగులూరు వచ్చిన వివాదాస్పద మహిళా అఘోరీ

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కిన మహిళా అఘోరీ వైజాగ్ నుంచి చెన్నై వెళ్తూ సోమవారం పంగులూరు మండలంలోని జాగర్లమూడివారి పాలెం వచ్చింది. విశ్రాంతి కోసం ఆగిన ఆమెను చూడడానికి చుట్టుపక్కల ప్రజలు భారీగా వచ్చారు. దీంతో హైవే మీద ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని నియంత్రించి ఆమెను అక్కడి నుంచి పంపించి, ట్రాఫిక్ క్లియర్ చేశారు.
Similar News
News April 17, 2026
బాల, బాలికలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించండి: కలెక్టర్

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘బడి పిలుస్తోంది’ ప్రత్యేక ప్రవేశోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈనెల 17 నుంచి 23 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్హత గల బాల, బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. స్లమ్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News April 17, 2026
హార్ముజ్ను ఇరాన్ ఇక ఆయుధంగా వాడదు: ట్రంప్

హార్ముజ్ జలసంధిని ఇకపై ఎప్పటికీ తెరిచే ఉంచేందుకు ఇరాన్ అంగీకరించిందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇకపై దానిని ఆ దేశం ఆయుధంగా ప్రయోగించదన్నారు. తమ సహకారంతో ఇరాన్ హార్ముజ్లోని మైన్స్ను తొలగిస్తోందన్నారు. యుద్ధం వేళ సమన్వయం పాటిస్తూ సహకరించిన సౌదీ, యూఏఈ, ఖతర్లకు ధన్యవాదాలు తెలిపారు. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అద్భుతమైన వ్యక్తులని పొగడ్తలతో ముంచెత్తారు.
News April 17, 2026
NTR జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలకు ఉరివేసి.. తల్లి ఆత్మహత్య

ఎన్టీఆర్ జిల్లాలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడ రూరల్ (M) పైడూరుపాడుకి చెందిన కవిత అనే మహిళ తన ఇద్దరు పిల్లలు లాస్య, సాత్విక్కు ఉరివేసి, అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గత ఐదేళ్లుగా కవిత వింతగా ప్రవర్తిస్తున్నట్టు సమాచారం. ఇబ్రహీంపట్నం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


