News October 8, 2025

పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

పత్తి పంటను కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా అధికారులతో పత్తి కొనుగోలు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 98,260 ఎకరాలలో పత్తి సాగు జరిగిందని, దీని ద్వారా సుమారు 11,79,000 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అక్టోబర్ తర్వాత పత్తి దిగుబడి ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.

Similar News

News January 20, 2026

షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

image

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

News January 20, 2026

NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NIT <<>>వరంగల్ 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ/బీటెక్, డిప్లొమా, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఇంటర్, టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 8 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, ST, PwBDలకు రూ.1000. స్క్రీనింగ్/స్కిల్/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/

News January 20, 2026

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరల వివరాలు

image

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 30 వేల ఏసీ బస్తాలు, 35 వేల కొత్త బస్తాలు అమ్మకానికి వచ్చాయి. మార్కెట్‌లో ధరలు ఈ విధంగా నమోదయ్యాయి. ప్రధాన రకాల ధరలు (కేజీకి): ఎల్లో రకం: రూ.350 – 450, (అత్యధికం) 2043: రూ.200 – 290 తేజా: రూ.140 – 185, 355 రకం: రూ.160 – 210, బుల్లెట్: రూ.160 – 200, నాటు రకాలు: రూ.150 – 210, సీడు తాలు: రూ.90 – 140 వరకు ధర పలికాయి.