News March 27, 2024
పది పరీక్షలు.. 77 మంది గైర్హాజరు

ఎస్సెస్సీ పరీక్షకు మంగళవారం 77మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఖమ్మం జిల్లా డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. మొత్తం 16,779 మంది విద్యార్థులకు గాను 16,702 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్, జిల్లా పరిశీలకుడు , అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను పలు కేంద్రాలను తనిఖీ చేశాయని ఆయన తెలిపారు.
Similar News
News February 12, 2026
ఖమ్మం: మున్సిపల్ కౌంటింగ్.. కలెక్టర్ కీలక ఆదేశాలు

ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కేంద్రాల్లో 100% వెబ్ క్యాస్టింగ్, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేయాలని, అధికారులు ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వర్తించాలన్నారు.
News February 12, 2026
ఖమ్మం ఆసుపత్రికి మహర్దశ.. కలెక్టర్ చొరవతో కొత్త రోడ్లు

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దశాబ్దం కాలంగా అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లకు మోక్షం లభించింది. కలెక్టర్ ఆదేశాలతో కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, టాయిలెట్ల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టనున్నారు. దీనివల్ల నిత్యం ఆసుపత్రికి వచ్చే 5 వేల మంది రోగులు, సిబ్బందికి దుమ్ము, ధూళి సమస్యల నుంచి విముక్తి కలగనుంది.
News February 12, 2026
5 మున్సిపాలిటీల్లో కట్టుదిట్టమైన బందోబస్తు: ఖమ్మం కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 5 మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఎంట్రెన్స్, ఎగ్జిట్లు, వెబ్కాస్టింగ్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్తో లెక్కింపు ప్రారంభమవుతుందని చెప్పారు. ఏదులాపురం(31), మధిర(22), సత్తుపల్లి(23), వైరా, కల్లూరు (20) వార్డులకు 2 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుందన్నారు.


