News February 11, 2025

పదీ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్

image

జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 10,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అన్నారు. పరీక్ష కేంద్రాల ద్వారా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

Similar News

News April 19, 2026

VZM: నదిలో పడి వ్యక్తి మృతి

image

గజపతినగరం(M) పురిటిపెంట ఎస్సీకాలనీకి చెందిన నీలంశెట్టి రమణ(50) చంపావతి నదిలో జారిపడి శనివారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. రమణకు కొన్నేళ్ల కిందట వివాహమైంది. కుటుంబానికి దూరంగా ఉంటున్న ఇతను ఓ ప్రైవేటు దుకాణంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం అటుగా వెళ్తున్న సమయంలో మద్యం మత్తులో నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు.

News April 19, 2026

రాష్ట్రంలో భానుడి భగభగ.. ADBలో 44.3 డిగ్రీలు

image

TG: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు అత్యధికంగా ఆదిలాబాద్‌లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. నిజామాబాద్‌లో 43.1, మహబూబ్‌నగర్ 42.4, మెదక్ 42, రామగుండం 41.5, హకీంపేట్ 41.1, దుండిగల్ 40.3, భద్రాచలం 40.4, HYD 40.4, నల్గొండ 40, ఖమ్మంలో 40 డిగ్రీలుగా రికార్డయినట్లు వెల్లడించింది.

News April 19, 2026

HYD: MOU దశలో MMTSలో ‘ఫ్రీ ఫేర్‌’ (1)

image

MMTSలో ‘<<19687591>>జీరో ఫేర్<<>>’ (ఫ్రీ జర్నీ) ఎందుకో Way2News ఎక్స్‌క్లూజివ్‌లో తెలుసుకుందా. TG అవతరణ దినోత్సవం నుంచి ఏడాదిపాటు ప్రతిష్ఠాత్మకంగా నడపాలనే ప్రతిపాదనను CS రామకృష్ణరావు రైల్ నిలయంలో SCR GM సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ముందుంచారు. MMTS ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టంచేశారు. దీనిపై MOU ఇవ్వాలని రైల్వేశాఖ కోరింది. ప్రధానంగా HYDలో ట్రాఫిక్, కాలుష్యం తగ్గించడానికేనని సమాచారం.