News August 13, 2025

పదో మార్క్స్ ఇలా కౌంట్ చేస్తారు: నిర్మల్ DEO

image

ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పాత పద్ధతిలోనే నిర్వహించనున్నట్లు ఇన్‌ఛార్జ్ డీఈవో పరమేశ్వర్ తెలిపారు. ఇంత వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 80 మార్కుల ప్రశ్నాపత్రం, ఇంటర్నల్‌లో 20 మార్కులు ఉండేవని, ఈ రెండింటిలో వచ్చిన మార్కుల మొత్తాలను కలిపి తుది ఫలితాలు వెలువరించే వారని పేర్కొన్నారు. మార్చి 2026లో జరిగే పరీక్షల ఫలితాల్లో ఈ విధానాన్ని అవలంబించనున్నారని చెప్పారు.

Similar News

News March 9, 2026

భారీ నష్టం తప్పదు.. ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

image

తమపై దాడులు చేస్తోన్న ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు ఫైరవుతున్నాయి. అరబ్ దేశాలపై అటాక్స్ కొనసాగిస్తే టెహ్రాన్ భారీ నష్టాన్ని చవిచూస్తుందని సౌదీ హెచ్చరించింది. దీనివల్ల భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని తెలిపింది. అతి పెద్ద షైబా ఆయిల్ ఫీల్డ్‌పై దాడిని ఖండించింది. ఇరాన్ తమను మోసం చేసిందని ఖతర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులు చేయట్లేదని చెబుతూ డ్రోన్లతో విరుచుకుపడుతోందని మండిపడింది.

News March 9, 2026

రంగారెడ్డి: జిల్లాలో తొలిరోజు 139 మందికి వ్యాక్సిన్

image

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలి రోజులో భాగంగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 139 మంది బాలికలకు వ్యాక్సిన్ వేశారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రిలో 19 మంది, వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో 10, రాజేంద్రనగర్‌లో 30, హయత్‌నగర్‌లో 10, శంషాబాద్‌లో 20, చేవెళ్లలో 22, షాద్‌నగర్‌లో 17, మహేశ్వరంలో ఏడుగురు బాలికలకు వ్యాక్సిన్ వేశారు.

News March 9, 2026

శ్రీవారే భక్తుడికి కలలో కనిపించిన ఘటన.!

image

TTDలో 1964 వరకు ఎవరన్నా స్వామి వారికి <<19334356>>ఆభరణాలు<<>> సమర్పించాలంటే నగలతోపాటు, వాటికి సమానమైన నగదు సమర్పించాల్సి ఉండేది. దీనినే ‘వర్తన’ అనేవారు. రాజులు, జమిందార్లు తరచూ విలువైన బహుమానాలు తెచ్చి స్వామి వారికి అలంకరిచాలని అధికారులపై ఒత్తిడి తెచ్చేవారంటా. దీనిని తగ్గించడానికి ఈ నిబంధన తెచ్చారు. ఈ నిబంధన ఓ సామాన్య భక్తుడి వలన రద్దయింది. స్వామివారే భక్తుడి కలలో కనిపించి ఏం చెప్పారో ఈ స్టోరీలో చూద్దాం.