News December 11, 2024
పనులు త్వరగా పూర్తి చేయాలి: ప.గో కలెక్టర్
డిసెంబర్ 13న విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో స్వర్ణాంధ్ర @ 2047 విజన్ డాక్యుమెంట్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి బుధవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా శాఖల వారీగా అప్పగించిన పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. యాక్షన్ ప్లాన్ మొత్తం జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో జరుగుతుందన్నారు.
Similar News
News January 14, 2025
కొయ్యలగూడెం: మేక మాంసానికి కేజీ కోడి మాంసం ఫ్రీ
కొయ్యలగూడెం పట్టణంలోని టీపీ గూడెం రోడ్డులోని ఓ మాంస కొట్టు వ్యాపారి భారీ ఆఫర్ ప్రకటించారు. రేపు కనుమ సందర్భంగా కిలో మేక మాంసం రూ.800కు కొనుగోలు చేసిన వారికి కిలో కోడి మాంసం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ రేపు ఒక్కరోజు మాత్రమే ఉంటుందన్నారు.
News January 14, 2025
ప.గో జిల్లాలో కోసా రూ. 3 వేలు
రసవత్తర పోరులో ఓడి ప్రాణాలు కోల్పోయిన పందెం కోళ్లకు ఉభయగోదావరి జిల్లాల్లో భలే గిరాకీ ధర పలుకుతోంది. అయితే ఇక్కడ పందేనికి సిద్ధం చేసే కోళ్లకు ఓ ప్రత్యేకమైన ఫుడ్ మెనూ ఉంటుంది. దీంతో అవి మరణించాక రుచిగా ఉంటాయని మాంసం ప్రియులు చెబుతూ ఉంటారు. దీంతో పందెంలోని ఒక కోసా రూ. 2వేలు నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతోందని పలువురు అంటున్నారు.
News January 14, 2025
ఏలూరుకు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆత్మహత్య
తూ.గో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కొల్లే రాజుకుమార్ (38) లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రాజ్ కుమార్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నారు. అయితే భార్యతో మనస్పర్థల కారణంగా గత 8 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. బొమ్మూరు ఎస్సై ప్రియ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.