News November 6, 2025

పరకామణి చోరీ కేసు.. 30మందితో విచారణ

image

తిరుమల పరకామణి చోరీ కేసులో విచారణ మొదలైంది. ఐదు బృందాలుగా అధికారులు ఏర్పడ్డారు. 20 మంది ప్రత్యక్షంగా, 10 మంది అధికారులు ఆఫీస్ నుంచి విచారణ కొనసాగించనున్నారు. డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గంగాధర్, ముగ్గురు డీఎస్పీలు, ఫోరెన్సిక్, సైబర్, ఐటీ విభాగం, లీగల్ విభాగం సభ్యులు విచారణలో పాల్గొంటారు. 28రోజుల్లో విచారణ పూర్తి చేసి హైకోర్టులో నివేదిక సమర్పించనున్నారు.

Similar News

News January 23, 2026

పర్యావరణ పరీక్షకు 782 విద్యార్థుల గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పర్యావరణ విద్య పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆర్ఐఓ లాలప్ప తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా మొత్తంగా 26,465 హాజరు కావలసి ఉండగా.. 25,683 విద్యార్థులు హాజరయ్యారన్నారు. 782 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. పరీక్షను ఇంటర్ బోర్డు ఆర్జేడీ (కడప) డాక్టర్ సురేశ్ బాబు పర్యవేక్షించారు.

News January 23, 2026

RTC బస్టాండ్‌లో పరిశుభ్రత పాటించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ సేవల పై పాజిటివ్ పర్సెప్షన్ మరింతగా మెరుగుపర్చేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీసీ హాలులో శుక్రవారం ప్రజారవాణా, రిజిస్ట్రేషన్ శాఖ, అగ్నిమాపక శాఖ అంశాల పై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీబస్టాండ్‌లో తాగునీరు, పరిశుభ్రత, సీటింగ్, మరుగుదొడ్ల నిర్వహణ తదితర మౌలిక సౌకర్యాలు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

News January 23, 2026

రాష్ట్ర ఉత్తమ BLOగా పెనుగంచిప్రోలు VRO

image

పెనుగంచిప్రోలు VRO పర్చా సుధాశ్రీ రాష్ట్రస్థాయి ఉత్తమ BLO అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆమె పురస్కారం అందుకోనున్నారు. గతంలో జిల్లా ఉత్తమ BLOగా, ఉత్తమ VROగా సేవలు అందించిన ఆమెను తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది అభినందించారు. సుధాశ్రీ సాధించిన ఈ విజయంపై మండలంలో హర్షం వ్యక్తమవుతోంది.