News April 14, 2024
పరవాడ: ‘ప్రజలు మరోసారి అవకాశం కల్పించాలి’

పెందుర్తి ఎమ్మెల్యేగా మళ్లీ పోటీ చేస్తున్నానని ప్రజలు మరోసారి అవకాశం కల్పించాలని వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ విజ్ఞప్తి చేశారు. పరవాడ మండలం భర్నికం గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని అన్నారు. భర్నికం పంచాయతీ అభివృద్ధికి రూ.1.94 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అలాగే రూ.10.76 విలువ గల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం జరిగిందన్నారు.
Similar News
News December 15, 2025
గాజువాకలో యువతి ఆత్మహత్య

గాజువాకలోని జింక్ గేటు ఎదురుగా గల 59వ వార్డ్లోని హిమచల్ నగర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న గిడుతూరు సాయి కుమారి (23) తన ఇంట్లో ఆదివారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందింది. తల్లిదండ్రులు గమనించి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గాజువాక పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. యువతి మృతికి గల కారణాలు తెలియల్సి ఉంది.
News December 15, 2025
నేడు GVMCలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

విశాఖలోని GVMC ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, టౌన్ ప్లానింగ్ వంటి సమస్యలపై ప్రజలు నేరుగా అర్జీలు సమర్పించవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి సూచించారు.
News December 14, 2025
విశాఖ: ఆర్టీసీలో నెల రోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు

ఆర్టీసీలో నెలరోజుల పాటు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఈనెల 20 నుంచి జనవరి 19వ తేదీ వరకు 48 గంటల్లోనే కస్టమర్లకు పార్సెల్ డెలివరీ చేస్తామన్నారు. విశాఖలో 84 కౌంటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. తక్కువ రేట్లకే కస్టమర్ వద్దకు పార్సెల్స్ చేరుతాయని, ఆర్టీసీకి అదనంగా ఆదాయం చేకూర్చే విధంగా సిబ్బందితో కార్గోపై ప్రచారం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


