News January 5, 2025

పరశురామ అవతారంలో దర్శనమిచ్చిన భద్రాద్రి రామయ్య

image

భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యాయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలలో ఆరో రోజు (ఆదివారం) పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పరశురామావతారంలో ఉన్న స్వామి వారికి బేడా మండపంలో ధనుర్మాస పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం మహారాజభోగం,మహా నివేదన తరువాత స్వామివారిని తిరువీధులలో ఊరేగిస్తారు.

Similar News

News January 16, 2025

కనులపండువగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం, నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News January 16, 2025

ప్రత్తి మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన తుమ్మల

image

ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాలన్ని మంత్రి తుమ్మల సందర్శించారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో అక్కడున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఐజీతో మట్లాడి ఓ ఫైర్ ఇంజిన్ ను పర్మినెంట్ గా మార్కెట్ లో అందుబాటులో ఉంచాలన్నారు. 

News January 16, 2025

ఖమ్మం: ఒక్క గ్రామంలో 10 మందికి టీచర్ ఉద్యోగాలు 

image

ఎర్రుపాలెం మండలం రాజులడేవరపాడులో 10 మంది టీచర్ ఉద్యోగాలు సాధించారు. సంక్రాంతి సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించి కొలువులు సాధించిన వారిని గ్రామస్థులు సన్మానించారు. దుద్దకూరు గోపిక్రిష్ణ యాదవ్, దుద్దుకూరు కృష్ణ వేణి, పొదిల సాంబయ్య మరికొందరు జాబ్స్ కొట్టిన వారిలో ఉన్నారు.