News March 7, 2025
పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి : ఆదిరెడ్డి శ్రీనివాస్

గోదావరి లంకల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రానున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత శాఖలను సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధికి బడ్జెట్లో రూ.469 కోట్లు కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News December 7, 2025
రౌడీషీటర్లకు ఎస్పీ హెచ్చరిక

తూర్పుగోదావరి ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాలతో ఆదివారం జిల్లావ్యాప్తంగా రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎస్హెచ్ఓల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేరస్తుల ప్రవర్తనపై ఆరా తీశారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, మళ్లీ చట్టవ్యతిరేక పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాల్లో భాగస్వాములైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News December 7, 2025
రేపు ‘నన్నయ్య’కు మాజీ ఉపరాష్ట్రపతి

ఆదికవి నన్నయ వర్సిటీలో 8, 9 తేదీల్లో “భారతీయ భాషలలో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం”పై జాతీయ కార్యశాల జరగనుంది. కేంద్ర విద్యాశాఖ, భారతీయ భాషా సమితి సహకారంతో నిర్వహించే ఈ సదస్సుకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శాస్త్రీయ పదజాలాన్ని ప్రాంతీయ భాషల్లోకి సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
News December 7, 2025
కడియంలో “జనసేన”కేదీ ప్రాధాన్యత..?

కడియం మండలంలో జనసేనకి ప్రాధాన్యం తగ్గుతుందని ఆ పార్టీ శ్రేణులు అంతర్మధనంలో ఉన్నాయి. గతంలో మెజారిటీ ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానం గెలిచినా ఎంపీపీ పదవిని టీడీపీకి త్యాగం చేశారు. తాజాగా సొసైటీ ఛైర్మన్ల నియామకంలోనూ టీడీపీ మూడు దక్కించుకోగా, జనసేనకు ఒక్కటే దక్కింది. ఇప్పటికే రెండు పదవులున్న ఎంపీపీ బంధువుకే మళ్లీ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని జనసైనికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు లోకల్గా టాక్ నడుస్తోంది.


