News March 27, 2024

పలాసకు చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య

image

పలాస మండలం మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40), జమ్మూకశ్మీర్‌ ఉదంపూర్‌లోని యూనిట్‌లో జేసీఓ క్యాడర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జమ్మూకశ్మీర్‌ నుంచి ఈ రోజు సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.

Similar News

News February 18, 2026

ఎల్.ఎన్.పేట: ‘నదీతీరాన ఆకట్టుకున్న ఈశ్వరుడి సైకత శిల్పాలు’

image

ఎల్.ఎన్.పేట గ్రామానికి చెందిన సైకత శిల్పి తరణి ప్రసాద్ మిశ్రా వంశధార నదీ తీరంలో రూపొందించిన సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుధవారం చక్ర తీర్థ స్నానాలు సందర్భంగా శివుడు, శివలింగం కళాకృతులను తరణి ప్రసాద్ మిశ్రా నిర్మించారు. వీటికి భక్తులు పసుపు,కుంకుమలో పూజలు చేశారు.

News February 18, 2026

రీసర్వే వేగవంతం చేయండి: శ్రీకాకుళం కలెక్టర్

image

రీసర్వే ప్రక్రియ వేగవంతం చేయాలని, రికార్డుల్లో వ్యత్యాసాలను సరిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. 4వ దశ రీసర్వే 167 గ్రామాల్లో జరుగుతోందని,24 గ్రామాల్లో పూర్తయిందన్నారు. weblandలో ఇతరుల పేరిట ఉన్న భూముల వివరాలు పరిశీలిస్తే 29,953 సర్వే నంబర్లలో తప్పులున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు.

News February 18, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

టెక్కలి: రోజులు గడిచాయి..వసతుల్లో మార్పు రాదా?
తాలభద్ర రైల్వే వంతెన పనులు ప్రారంభిస్తాం: రామ్మోహన్
జలుమూరు: చక్రతీర్థ స్నానాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా డీ-వార్మింగ్ డే కార్యక్రమం
ఎల్.ఎన్ పేట: ఎరువుల కోసం రైతుల పాట్లు
జేఈఈ మెయిన్స్‌లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు
కవిటి: ఈనెల 26న ఎల్లమ్మ జాతర.