News December 2, 2025

పలు శాఖలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన: కలెక్టర్

image

ప్రభుత్వం అమలు చేస్తున్న సేవల పట్ల ప్రజల అభిప్రాయాన్ని మెరుగుపరిచే విధంగా కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ హాలులో శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎంత మేరకు చేరుతున్నాయనే అంశంపై వివిధ మార్గాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందన్నారు. వాటిలో వైద్య ఆరోగ్య, దేవాదాయ, సర్వే, వ్యవసాయ శాఖలపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన ఉందన్నారు.

Similar News

News February 19, 2026

మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు!

image

ముస్లిం రిజర్వేషన్లను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విద్యా సంస్థల అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 5% కోటాను ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులను క్యాన్సిల్ చేసింది. 2014 జులైలో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తూ నాటి కాంగ్రెస్-NCP ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ కోర్టు తీర్పుల కారణంగా రిజర్వేషన్ అమలు కాలేదు. ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోయింది. తాజాగా ఆ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రద్దు చేసింది.

News February 19, 2026

బెండలో పేనుబంకను ఎలా నివారించాలి?

image

బెండ పంటలో పేనుబంక లక్షణాలను గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలను తీసుకోవాలి. లేకుంటే పంట నష్టం తీవ్రంగా ఉంటుంది. పేనుబంక నివారణకు 100 లీటర్ల నీటిలో అజాడిరక్టిన్(3000 PPM) 300ML కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. అయినా ఉద్ధృతి తగ్గకపోతే 100 లీటర్ల నీటిలో థయోమిథాక్సాం 30 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 200mlను కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News February 19, 2026

హై బీపీ.. ఇలా తగ్గించుకోండి!

image

అధిక రక్తపోటు వల్ల గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హై BPని అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ‘సోడియం ఎక్కువుండే ఫుడ్ తినొద్దు. పండ్లు, కూరగాయలు, మిల్లెట్స్‌తో కూడిన ఆహారం తీసుకోండి. వ్యాయామం చేయండి. మద్యం అలవాటు ఉంటే మితంగా తాగండి. ధ్యానం/యోగాతో ఒత్తిడి తగ్గించుకోండి. క్రమం తప్పకుండా BP చెక్ చేసుకోండి. మందులు స్కిప్ చేయొద్దు’ అని చెబుతున్నారు.