News November 20, 2025
పల్నాటి వీరారాధనోత్సవాల్లో రాయబార ఘట్టం

పల్నాటి వీరాధనోత్సవాల్లో గురువారం రాయబార ఘట్టాన్ని నిర్వహించారు. సుమారు 7 సంవత్సరాలు 6 నెలలుగా అరణ్యవాసంలో ఉన్న మాచర్ల రాజ్యమంది తిరిగి తమ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని బ్రహ్మన్న మళ్లీ దేవరాజులు అనుకునే సంఘటనగా ఆచారవంతులు ప్రతిబింబించగా, పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొణతాలతో (వీరుల ఆయుధాలు) గ్రామోత్సవం ఘనంగా జరిగింది.
Similar News
News January 18, 2026
T20 WC టీమ్లో ప్లేస్ మిస్.. స్పందించిన సిరాజ్

T20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవడంపై భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొలిసారి మౌనం వీడారు. ‘నేను గత T20 ప్రపంచకప్లో ఆడాను. ఈసారి ఆడటం లేదు. ఒక ప్లేయర్కు ప్రపంచకప్లో ఆడటం అనేది ఒక కల. దేశం కోసం ఆడటం గొప్ప విషయం. ప్రస్తుతం ఎంపికైన జట్టు బాగుంది. మంచి ఫామ్లో ఉంది. వారికి నా విషెస్. ట్రోఫీ గెలవాలి’ అని అన్నారు. సౌతాఫ్రికాతో సిరీస్లోనూ లేకపోవడంపై వర్క్లోడ్ మ్యానేజ్మెంటే కారణమని వివరించారు.
News January 18, 2026
మంచిర్యాల: రేపటి ‘ప్రజావాణి’ రద్దు

మున్సిపల్ ఎన్నికల విధులు, మంత్రుల పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర పరిపాలనా పరమైన పనుల ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని, కలెక్టరేట్కు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
News January 18, 2026
VZM: కలెక్టరేట్లో రేపు PGRS కార్యక్రమం

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


