News November 19, 2025

పల్నాడు జిల్లాను పచ్చదనంతో నింపాలి: కలెక్టర్

image

జిల్లాను పచ్చదనంతో నింపి హరిత పల్నాడును ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వనం – మనం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అన్ని శాఖలు సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు, ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, లక్ష్యాలుపై నివేదిక సమర్పించాలన్నారు.

Similar News

News January 23, 2026

విజయవాడ: ప్రేమ పేరుతో బాలికను లోబర్చుకుని మోసం

image

మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రీస్తురాజుపురానికి చెందిన చెందిన ఓ బాలిక(15)ను అదే ప్రాంతానికి చెందిన వసంత్ కుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో శారీరకంగా లోబర్చుకుని మోసం చేశాడు. ఈ ఘటనపై తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు వసంత్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు మాచవరం సీఐ వెంకటరమణ గురువారం తెలిపారు.

News January 23, 2026

గ్రామ ప్రియ కోళ్ల గురించి తెలుసా?

image

గ్రామ ప్రియ కోళ్లు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే గ్రామ ప్రియ కోళ్లు పెరటి పెంపకానికి ఎంతో అనువైనవి. వీటి గుడ్లు గోధుమ రంగులో ఉంటాయి. ఇవి ఆరు నెలల వయసు వచ్చేసరికే రెండున్నర కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఏడాదిలో 250 గుడ్లను పెడతాయి. అధిక వ్యాధినిరోధక శక్తిని కలిగి ఉండటం వల్ల త్వరగా జబ్బుల బారిన పడవని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు.

News January 23, 2026

SKLM: ప్రతి 10ని.లకు ప్రత్యేక బస్సు

image

రథసప్తమి వేడుకల సందర్భంగా ఈ నెల 25న RTC ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సి.హెచ్. అప్పల నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణీకుల సౌకర్యార్థం, విశాఖ, విజయనగరం, రాజాం, పాలకొండ, బత్తిలి, శ్రీముఖలింగం, పాతపట్నం, టెక్కలి, పలాస నుంచి సాధారణ ఛార్జీలతో నడుస్తాయన్నారు. ప్రతి 10 నిమిషాలకు ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు.