News November 19, 2025
పల్నాడు జిల్లాను పచ్చదనంతో నింపాలి: కలెక్టర్

జిల్లాను పచ్చదనంతో నింపి హరిత పల్నాడును ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం వనం – మనం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో అన్ని శాఖలు సమష్టిగా, సమన్వయంతో పనిచేయాలని అన్నారు. విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు, ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలు, లక్ష్యాలుపై నివేదిక సమర్పించాలన్నారు.
Similar News
News January 18, 2026
VZM: కలెక్టరేట్లో రేపు PGRS కార్యక్రమం

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
News January 18, 2026
నర్సింగ్ విద్యార్థులకు జపనీస్, జర్మన్ భాషలు నేర్పిస్తాం: CM

TG: నర్సింగ్ కోర్సు చేసిన వారికి జపాన్, జర్మనీలో మంచి డిమాండ్ ఉందని CM రేవంత్ అన్నారు. విద్యార్థులకు నర్సింగ్ కోర్సుతో పాటు జపనీస్, జర్మన్ భాషలు నేర్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్కి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. JNTU కళాశాల, మద్దులపల్లి మార్కెట్ యార్డ్, నర్సింగ్ కాలేజీని ప్రారంభించారు.
News January 18, 2026
హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్షిప్

DRDOకు చెందిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో 40 పెయిడ్ ఇంటర్న్షిప్లకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. BE/BTech 7, 8వ సెమిస్టర్, MTech ఫస్ట్ ఇయర్/ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in


