News February 3, 2025

పల్నాడు: పెదనందిపాడులో అత్యాచారం, హత్య 

image

పెదనందిపాడులో దారుణ సంఘటన జరిగింది. 64 ఏళ్ల వృద్ధురాలిపై జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన నిందితుడు మంజు అత్యాచారం చేసి హత్య చేశాడు. జరిగిన సంఘటనపై వృద్ధురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రైని ఎస్పీ దీక్షిత, డీఎస్పీ భానోదయ, సీఐ శ్రీనివాస రావులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలు ముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కి పోలీసులు తరలించారు. 

Similar News

News March 8, 2026

యాదాద్రి: గిరి ప్రదక్షిణ భక్తులకు ‘ఉచిత దర్శనం’

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రం (స్వాతి) సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసిన భక్తులకు ఆలయ అధికారులు తీపి కబురు అందించారు. ప్రదక్షిణలో పాల్గొన్న వారికి ప్రత్యేకంగా ఉచిత దర్శన టోకెన్లను పంపిణీ చేస్తున్నారు. స్వామివారి నిజాభిషేకం అనంతరం ఈ టోకెన్లు ఉన్న భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. అధికారుల నిర్ణయంపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News March 8, 2026

KMR: మహిళే ఓదార్పు

image

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ.. పురుషుల్లోని క్రూరత్వం మానవత్వాన్ని చంపేస్తుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఓ చోట అత్యాచారం, మరోచోట పెత్తనంతో హత్యాచారం, ఇంకోచోట పిల్లలను కడతేర్చే ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళలకు గౌరవం దక్కుతుందే తప్పా మిగతా రోజులు మిథ్యగానే మారుతున్నాయి.

News March 8, 2026

ఫైనల్ మ్యాచ్ క్రేజ్.. ధరలు భారీగా పెంచేశారు!

image

భారత్, NZ మధ్య నేడు T20WC ఫైనల్ జరగనున్న నేపథ్యంలో అహ్మదాబాద్‌లో హోటల్ రూముల ధరలు కొండెక్కాయి. లగ్జరీని బట్టి ఒక్క రాత్రి బసకు రూ.18 వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక పలు ఎయిర్‌లైన్స్ ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక సర్వీసులు నడుపుతుండగా వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. ఇక స్టేడియంలోని లక్షా 30వేల టికెట్లు అమ్ముడుపోగా, 15వేల మంది పోలీసులు స్టేడియం వద్ద భద్రత కల్పిస్తున్నారు.