News June 17, 2024
పల్నాడు: రైతు భరోసా కేంద్రంలో చోరీ

ఈపూరు మండలంలోని కొండ్రముట్ల రైతు భరోసా కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి రైతు భరోసా కేంద్రం తాళాలు పగులగొట్టి, కంప్యూటర్, టీవీలను చోరీ చేశారు. ఆదివారం ఉదయం అటువైపు వెళుతున్న రైతు ఒకరు రైతు భరోసా కేంద్రం తెరిచి ఉండటం చూసి వ్యవసాయశాఖ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వ్యవసాయశాఖ ఏవో రామినేని రామారావు తెలిపారు.
Similar News
News January 24, 2026
ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేశాం: మంత్రి నారాయణ

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు వేగవంతం చేశామని మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 496 ప్లాట్లు కేటాయింపు పూర్తయిందని, మిగిలిన రైతులకు ఈ నెల 28 న లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు చేస్తామని పేర్కొన్నారు. ప్లాట్లు పొందిన రైతులకు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
News January 24, 2026
ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలుగ జేయుటకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
News January 24, 2026
ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ నెల 25న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఎన్నికల నమోదు అధికారులు, జిల్లా అధికారులతో శుక్రవారం కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలుగ జేయుటకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. యువతను ఇందులో భాగస్వామ్యం చేయాలని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.


