News April 11, 2025

పాడేరు: కలెక్టరేట్‌లో ఫూలే జయంతి కార్యక్రమం

image

మహాత్మా జ్యోతిరావు ఫూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడని కలెక్టర్ దినేశ్ కుమార్ కొనియాడారు. ఫూలే జయంతిని కలెక్టరేట్‌లో  శుక్రవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు.

Similar News

News April 25, 2025

కల్వకుర్తి: పాల రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కృష్ణారెడ్డి ఎన్నిక

image

కల్వకుర్తి మండలం గుండూర్ గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి పాల రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన రాష్ట్ర సమావేశాల్లో కృష్ణారెడ్డిని నాగర్ కర్నూల్ జిల్లా నుంచి ఎన్నుకున్నారు. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాల రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

News April 25, 2025

హిందువులైతే ఇలా చేయరు.. ఉగ్రదాడిపై భాగవత్

image

పహల్గామ్ ఉగ్రదాడికి కేంద్రం ఘాటుగా బదులిస్తుందనే నమ్మకముందని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. బాధితుల్ని మతం పేరు అడిగి చంపారు, అదే హిందువులైతే ఇలా చేసి ఉండేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మనమంతా ఐక్యంగా ఉంటే మనల్ని చూడడానికే ఎవరూ ధైర్యం చేయరు అని తేల్చిచెప్పారు. రావణుడికి కూడా బుద్ధి మార్చుకోమని రాముడు అవకాశమిచ్చారు. తీరు మార్చుకోకపోవడంతో సంహరించాల్సి వచ్చిందని అన్నారు.

News April 25, 2025

కర్నూలు: 4,348 మందికి జూన్ 1న ఫైనల్ పరీక్ష

image

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు జూన్‌ 1న ఫైనల్‌ పరీక్ష నిర్వహించనున్నారు. కానిస్టేబుల్, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష 2023 జనవరి 22న జరిగింది. అర్హత సాధించిన వారికి గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు కర్నూలులో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అందులో 4,348 మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. వారందరికీ జూన్ 1న మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

error: Content is protected !!