News February 8, 2025
పాడేరు: ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి

ఆకాంక్ష జిల్లాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు సుమన్ కుమార్ బేరీ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఆకాంక్ష బ్లాక్ల అభివృద్ధిపై సమావేశం నిర్వహించారు. మారుమూల గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందాలన్నారు. వైద్య ఆరోగ్య సేవలు, పోషకాహారం, వ్యవసాయం నీటిపారుదల సదుపాయాలు, ఆర్థిక చేకూర్పు, నైపుణ్యాభివృద్ధి మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు.
Similar News
News February 13, 2026
NRPT: కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత!

NRPT జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపునకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 550 మంది సిబ్బందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వినీత్ తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
News February 13, 2026
అనకాపల్లి: శివరాత్రికి శైవ క్షేత్రాలకు నడిచే బస్సులు ఎన్ని అంటే?

అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోల నుంచి శైవ క్షేత్రాలకు 95 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ) అధికారిణి ప్రవీణ తెలిపారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రావికమతం మండలం కళ్యాణపులోవ, గొలుగొండ మండలం దారమఠం, విజయనగరం జిల్లా పుణ్యగిరి శైవక్షేత్రాలకు ఈ బస్సులను నడుపుతున్నామని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News February 13, 2026
చీరాల: దొంగతనం కేసులో నిందితుడికి జైలు శిక్ష

చీరాల 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2018లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు బాలరాజుకు చీరాల పీజేసీజే కోర్టు జైలు శిక్షను నేడు విధించింది. దొంగతనం చేసినట్లు రుజువడంతో 8 నెలలు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. కేసు విచారణలో కృషి చేసిన SHO, ఏపీపీ పద్మారెడ్డి, కోర్టు సిబ్బందిని జిల్లా SP జి. ఉమామహేశ్వర్ IPS అభినందించారు.


