News November 19, 2025

పాడేరు: ‘1,44,222 మంది రైతులకు పెట్టుబడి సాయం’

image

రైతులు పండించే పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. బుధవారం పాడేరు కాఫీ హౌస్‌లో వ్యవసాయ శాఖ నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో 22మండలాల్లో 1,44,222 మంది గిరిజన రైతులకు ఒక్కొక్కరికి రూ.7వేలు చొప్పున పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ఆర్ధిక సాయం అందించడం జరుగుతుందన్నారు.

Similar News

News January 23, 2026

ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

image

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.

News January 23, 2026

వసంత పంచమి రోజు పఠించాల్సిన మంత్రాలివే..

image

చదువుల తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ‘సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం’ పఠించడం అత్యంత ఫలప్రదం. విద్యార్థులు ‘సరస్వతి నమస్తుభ్యం’ శ్లోకాన్ని 108 సార్లు జపించాలి. మేధాశక్తి పెరగడానికి ‘ఓం హ్రీం ఐం సరస్వత్యై నమః’ అనే బీజాక్షర మంత్రాన్ని ధ్యానించాలి. గ్రహ దోషాలు, బుధ గ్రహ దోషం ఉన్నవారు సరస్వతీ కవచం పఠించడం వల్ల వాక్చాతుర్యం లభిస్తుంది. భక్తితో ఈ మంత్రాలను స్మరిస్తే ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో విజయం లభిస్తుంది.

News January 23, 2026

ఒడిశాకు కీలక లైన్లు? ఏపీకి షాక్‌గా మారిన రైల్వే విభజన

image

విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ బౌండరీస్ చుట్టూ రాజకీయ వివాదం రాజుకుంటోంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అనుమానాలకు తావిస్తుండగా, జ్యూరిడిక్షన్ అంశం చర్చనీయాంశమైంది. వాల్తేర్ డివిజన్ ఆదాయానికి కీలకమైన KK లైన్‌ను ఒడిశా పరిధికి తరలించే ప్రయత్నాలు ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి.