News January 20, 2025
పాతపట్నం: ఇంట్లోకి చొరబడి.. వైసీపీ కార్యకర్తపై దాడి

పాతపట్నం మేజర్ పంచాయతీ దువ్వారి వీధికి చెందిన పెద్దింటి తిరుపతిరావు పై హత్య ప్రయత్నం జరిగింది. తిరుపతి నిద్రిస్తుండగా రాత్రి 3 గంటల సమయంలో (ఆదివారం రాత్రి తెల్లవారితే సోమవారం) గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి కత్తితో మెడ పైన దాడి చేయడం జరిగింగి. తిరుపతిరావు ఓ పత్రిక రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. వైసీపీ కార్యకర్తగా ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News February 12, 2025
సారవకోట: బాలికపై అత్యాచారం

సారవకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం పదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బాలిక సోమవారం పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా తినుబండారాలు ఇచ్చి లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడుస్తూ విషయం తల్లికి చెప్పింది. తల్లి ఫిర్యాదుతో ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు చేశారు. డిఎస్పీ డి.ప్రసాదరావు విచారణ చేపట్టారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News February 12, 2025
శ్రీకాకుళం: రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య

వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసి, సేవలు మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ ఐడి) ఆధార్ కార్డు తరహాలో అందించనున్నదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో సొంత భూమి కలిగిన ప్రతి రైతుతోనూ ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించాలన్నారు.
News February 11, 2025
శ్రీకాకుళం: క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం

రాష్ట్ర పీఈటి సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో జరిగిన సెమినార్, క్రీడా పోటీలలో శ్రీకాకుళం జిల్లా హ్యాండ్ బాల్ జట్టు రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో గెలుపొందిన జట్టుకు మంగళవారం జిల్లా కేంద్రంలో డీఈవో, తిరుమల చైతన్య, డిప్యూటీ డిఈవో విజయ కుమారి అభినందించారు. క్రీడా పోటీల్లో ప్రథమ స్థానం రావడం గర్వంగా ఉందన్నారు. ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆకాంక్షించారు.