News December 1, 2025
పాతబస్తీ మెట్రోకు రూ.125 కోట్లు మంజూరు

పాతబస్తీ మెట్రోకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులకు అనుమతులు వచ్చినట్లుగా అధికారులు పేర్కొన్నారు. పాతబస్తీ మెట్రోను మరింత వేగంగా నిర్మించడం కోసం ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.
Similar News
News February 11, 2026
GHMCపై కొత్త బాస్ల సంతకం

GHMC 3 ముక్కలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి కమిషనర్గా టి.వినయ్ కృష్ణారెడ్డిని, సైబరాబాద్ కమిషనర్గా సృజనతో స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ ఆధ్యర్యంలో బాధ్యతలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పారదర్శక పాలన, ప్రజాసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వారు పేర్కొన్నారు. నగర పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధికోసం పనిచేస్తామని తెలిపారు.
News February 11, 2026
HYD: వాటర్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వీరే!

నగరంలో నాన్ క్యాడర్ అధికారుల బదిలీలు జరిగాయి. మల్కాజిగిరి HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎస్.పంకజ బదిలీ అయ్యారు. హైదరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సామ్రాట్ అశోక్ నామ బదిలీ కాగా, సైబరాబాద్ HMWS&SB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎం.సంతోష్ బదిలీ అయ్యారు. లోక్ భవన్ జాయింట్ సెక్రటరీగా కె.శశికిరణచారి బదిలీ అయ్యారు. సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
News February 11, 2026
HYD: హోటల్ గదిలో అన్నాచెల్లెలి మృతదేహాలు

వారణాసి కాంట్ ప్రాంతంలోని సిట్ ఇన్ హోటల్లో 4 రోజులుగా బస చేస్తున్న HYD లక్డికాపూల్కు చెందిన గణేశ్ గౌడ్, అతడి సోదరి లక్ష్మీదేవి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు గది తలుపులు తెరవకపోవడంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి తలుపు తెరవగా.. ఇద్దరి నోటి నుంచి నురుగు రావడం, అక్కడ విషం ప్యాకెట్ లభించడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


