News April 20, 2024
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి: అబ్జర్వర్

ఏపీలో ఎన్నికలను పూర్తి పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్లు అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలన్నారు.
Similar News
News December 8, 2025
MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు

MVP రైతు బజార్ నుంచి ఆన్లైన్లో కూరగాయలు లభ్యమవుతున్నాయి. పైలెట్ ప్రాజెక్టుగా విశాఖలో అమలు చేస్తున్న అధికారులు దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నారు. రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ చేస్తున్నారు. మాచింట్ సొల్యూషన్స్ అనే సంస్థ https://digirythubazaarap.com వెబ్సైట్ ద్వారా 5 రోజులుగా 150 మందికి డెలివరీ చేసింది. ప్రస్తుతం ఎలాంటి అదనపు చార్జీలు లేవు.
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్సైట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్సైట్ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


